- భవన కార్మికుల రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి
- జిల్లా అధ్యక్షులు నిమ్మటూరి రామకృష్ణ
సత్తుపల్లి,ఆర్ సి,ఏప్రియల్19(జనవిజయం): ఏప్రియల్ 21,22 తేదీలలో రంగారెడ్డి జిల్లా శంషాబాద్ నందు తెలంగాణ రాష్ట్ర బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాలుగో మహాసభలను జయప్రదం చేయాలని తెలంగాణ రాష్ట్ర బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఖమ్మంజిల్లా అధ్యక్షులు నిమ్మటూరి రామకృష్ణ కార్మికులకు పిలుపునిచ్చారు. శనివారం సత్తుపల్లి పట్టణంలోని భవన నిర్మాణ కార్మికులకు కరపత్రాలు పంచి మహాసభల విజయవంతం కోసం ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ భవననిర్మాణ కార్మికులకు 1996 చట్టం ప్రకారం నిర్మాణ రంగ కార్మికులకు 50 సంవత్సరాలు నిండిన ప్రతి కార్మికుడికి సంక్షేమ బోర్డు నుంచి నెలకు 5000 రూపాయల పెన్షన్ సౌకర్యం కల్పించాలని భవన నిర్మాణ కార్మికుడు ప్రమాద బీమాను పది లక్షలకు పెంచాలని సహజ మరణానికి ఐదు లక్షలు ఇవ్వాలని నిర్మాణ కార్మికుడు కూతురు వివాహ కానుకకు లక్ష రూపాయలు ఇవ్వాలని పసుతి సహాయం లక్ష రూపాయలు ఇవ్వాలని నిర్మాణ కార్మికుల అడ్డాల వద్ద సౌకర్యాలు ఏర్పాటు చేయాలని రామకృష్ణ ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో:- బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షులు కంచి శ్రీనివాసరావు జిల్లా కమిటీ సభ్యులు వల్లూరు శీను,షేక్ రహీంతుళ్ళ,సత్యనారాయణ, వీరబాబు,అసవత్ కృష్ణ,పీట్ల వెంకటేశ్వరావు,రాంబాబు, వెంకటేశ్వరరావు,పుల్లారావు, సురేష్, ప్రసాదు,వెంకటరెడ్డి, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.