సత్తుపల్లి,ఆర్ సి,ఏప్రియల్24(జనవిజయం): గురువారం సత్తుపల్లి సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో ఉగ్రదాడినీ నిరసిస్తూ సత్తుపల్లి పట్టణ పాత సెంటర్లో ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దగ్ధం చేయటం జరిగింది.సిపిఎం సత్తుపల్లి పట్టణ కార్యదర్శి కోలికపోగు సర్వేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో పాల్గొన్న సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మోరంపూడి పాండురంగారావు మాట్లాడుతూ పర్యాటక ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదముష్కర్లు విచక్షణారహితంగా కాల్పులు జరిపి 28 మంది అమాయకపు పౌరుల, మరియు పర్యాటకులపై పర్యాటకులను అతి క్రూరంగా చంపటాన్ని తీవ్రంగా ఖండించారు.దేశ పౌరులనే కాదు ప్రపంచ దేశాలను కలచివేసే అమానీయమైన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి సిపిఎం సత్తుపల్లి పట్టణ కమిటీ తీవ్ర సంతాపాన్ని తెలియజేసిoది.వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్న గాయపడిన 20 మంది క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆప్తులను కోల్పోయిన కుటుంబాలను అన్ని విధాలుగా ప్రభుత్వాలు ఆదుకోవాలని సిపిఎం డిమాండ్ చేస్తుందనీ తెలిపారు.ప్రజల ప్రాణాలకు టూరిస్టులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. అన్నారు.ఈ కార్యక్రమంలో: సిపిఎం సత్తుపల్లి పట్టణ నాయకులు రావుల రాజబాబు, చావా రమేష్, చప్పిడి భాస్కర్, ఎస్కే వలి, వెంకటేశ్వరరావు ,సైదా మీరాజ్, నబి, చంద్రం, రాము, రామకృష్ణ, బడే మియా, వెంకటేశ్వరరావు, జిలాని, బుడే తదితరులు పాల్గొన్నారు.