Wednesday, May 14, 2025
Homeవార్తలుఆ లోపాలు సరి చేయకుంటే స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ కు నష్టమే!

ఆ లోపాలు సరి చేయకుంటే స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ కు నష్టమే!

  • ఇందిరమ్మ ఇండ్ల అర్హుల జాబితా గోప్యమెందుకు!
  • బహిర్గతం చేయడానికి కార్యదర్శులకు వణుకెందుకో!
  • ఎల్ 1 కు చెందిన అర్హులు పేర్లు గల్లంతా?
  • అన్ని పార్టీలకు చెందిన అర్హులకు అందని ఇందిరమ్మ ఇళ్లు!

సత్తుపల్లి,ఆర్ సి,మే02(జనవిజయం): ఖమ్మంజిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని మండలాలలో ఇందిరమ్మ ఇండ్ల కమిటీలు నిర్ధారించిన ఇందిరమ్మ ఇళ్ల అర్హుల జాబితా మండల అధికారుల,ప్రజా ప్రతినిధుల ఆమోదం పొందాక కూడా అట్టి జాబితా ను గోప్యంగా ఉంచుతున్నారని ప్రజలనుండి ఆరోపణలు వస్తున్నాయి.వేంసూరు మండలంలో ప్రతిపక్ష పార్టీకు చెందిన ఓ పార్టీ నేత,జర్నలిస్టు గ్రామ కార్యదర్శిని అర్హుల జాబితా,ఇండ్ల కేటాయింపు జాబితా చూయించాలని,జిరాక్స్ కావాలని కార్యాలయంలో నోటీసు బోర్డులో పొందుపరచాలని అడగగా సాధ్యం కాదు దయచేసి అర్థం చేసుకోండి అంటూ బ్రతిమలాడటం జరిగినట్లు విశ్వసనీయ సమాచారం. కార్యదర్శులకు వణుకెందుకో అర్థం కావడం లేదు.అన్ని పార్టీ లకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు మొదటి దశ ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో అవకాశం కల్పించ కుండా అధికార పార్టీ కు చెందిన వారికే కేటాయింపు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోవడానికి సిద్ధంగా ఉన్న వారిని ఎల్ 01 కేటగిరిగా,స్థలం,ఇల్లు లేని వారిని ఎల్ 02 కేటగిరిగా,అనర్హులను ఎల్ 03 కేటగిరిగా గుర్తిస్తూ నిర్ణయించారు. ఎల్ 01 కేటగిరి కు చెందిన ప్రతిపక్ష పార్టీకు చెందిన అర్హుల పేర్లను జాబితాలో లేకుండా గల్లంతు చేశారని అట్టి లోపాలు బహిర్గతం కాకుండా కప్పి పుచ్చుకున్నే దానికే అర్హుల జాబితా,మొదటి దశ లబ్ధిదారుల మంజూరు జాబితాలు బహిర్గతం చేయడం లేదని తెలుస్తోంది. ఇలానే జరిగితే రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో అధికార కాంగ్రెస్ పార్టీ కు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం కూడా ఉంది. వెంటనే లోపాలను సరి చేసే దానికి ఎమ్మెల్యే మట్టా రాగమయి, రాష్ట్ర కాంగ్రెస్ నేత మట్టా దయానంద్ విజయ్ కుమార్ లు దృష్టి పెట్టాలని అధికారులతో,ఇందిరమ్మ ఇండ్ల కమిటీలతో సంయుక్త సమావేశం ఏర్పాటు చేసి లబ్ధిదారులకు న్యాయం చేస్తే మంచిదని కొందరు రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments