- అకాల వర్షాలు వల్ల తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి సిపిఎం డిమాండ్
సత్తుపల్లి,ఆర్ సి,ఏప్రియల్19(జనవిజయం): సత్తుపల్లి రావి వీరవెంకయ్య భవన్లో సిపిఎం సత్తుపల్లి పట్టణ కమిటీ సమావేశం కొలికపోగు సర్వేశ్వరరావు అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మోరంపూడి పాండురంగారావు మాట్లాడుతూ తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు యాడ్స్ ప్రారంభమై 20 రోజులు గడుస్తున్నా సరైన సమయంలో మిల్లులు అలాట్మెంట్ కాకపోవడం వల్ల అకాల వర్షాలు బారిన పడిని రైతు తీవ్రంగా నష్టపోతున్నారు, దీనివల్ల ఆరుకాలం పండించి పంటను ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేయకపోవడం వల్ల తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ రైతులు నష్టపోతున్నారు అదేవిధంగా మావిడి మొక్కజొన్న మిరప రైతులను కూడా ప్రభుత్వమే బాధ్యత వహించి కొనుగోలు చేసి రైతుల్ని ఆదుకోవాలని అన్నారు కొనుగోలు చేయడంలో దొడ్డు రకం గింజలు మిల్లర్లు కోత విధించటం దారుణమని అన్నారు, యాడ్స్ లో నల్ల పట్టాలు అందుబాటులో ఉంచాలని తేమశాతం తో సంబంధం లేకుండా త్వరగా రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు, ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు రావుల రాజబాబు, చావా రమేష్, ఓలేటి శ్రీహరి, ఎస్ కే వలీ, చప్పిడి భాస్కర్, పాకలపాటి ఝాన్సీ, వెంకట్రావు, మరియు తదితరులు పాల్గొన్నారు.