సత్తుపల్లి,ఆర్ సి,ఏప్రియల్20(జనవిజయం):సత్తుపల్లి పట్టణంలో గల సింగరేణి డిస్పెన్సరీ ను ఏరియా ఆసుపత్రిగా మార్చాలని ఆదివారం ఐఎన్ టియుసి అనుబంధ సింగరేణి కార్మికుల సంఘం జెవిఆర్ ఓసీ బ్రాంచ్ కార్యదర్శి తీగల క్రాంతికుమార్ డిమాండ్ చేశారు.డిస్పెన్సరీ ను తమ సంఘం నేతలతో కలసి సందర్శించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.డిస్పెన్సరీ వైద్యునికి సమస్యల పరిష్కారం కోరుతూ వినతిపత్రాన్ని ఇచ్చారు.ఈ కార్యక్రమంలో:బాలాజీ,నాగేశ్వరరావు,కోటేశ్వరరావు లు పాల్గొన్నారు.