తల్లాడ,ఏప్రియల్20(జనవిజయం):ఏసుక్రీస్తు సర్వ మానవాళి శ్రేయస్సు కోసం మరణించి లేచిన మహోన్నతుడు దేవుని బిడ్డ అని తల్లాడ మాజీ ఎంపిపి దొడ్డా శ్రీనివాసరావు అన్నారు.ఆదివారం స్థానిక పరంజ్యోతి చర్చి నందు జరిగిన ఈస్టర్ పండుగ వేడుకలలో దొడ్డా పాల్గొని ప్రసంగించారు.ముందుగా కేక్ కటింగ్ చేసి పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో:-క్రైస్తవులు,నేతలు వీర మోహన్ రెడ్డి,వెంకటలాల్,రమేష్,రాము తదితరులు పాల్గొన్నారు.