సత్తుపల్లి,ఆర్ సి,ఏప్రియల్13(జనవిజయం) : సత్తుపల్లి మండల పరిధిలోని బుగ్గపాడు గ్రామంలో ఆదివారం ఉదయం వేద పాఠశాలకు రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు.హరహర క్షేత్రం ఆవరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి అర్చకులు పూర్ణ కుంభముతో స్వాగతం పలికారు. హరహర మహాదేవ క్షేత్రంలో శివునికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో:కాంగ్రెస్ నాయకులు తుమ్మల అభిమానులు గ్రామ పెద్దలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.