- జనవిజయం ప్రజా సమస్య వార్తకు స్పందన
- మూడునెలలుగా వెలగని వీధి దీపం వెలిగింది
వేంసూరు,ఏప్రియల్08(జనవిజయం):ఈ నెల 6 న ఆదివారం మూడు నెలలు గడిచినా వీధిదీపం వెలిగించరా సారు అనే శీర్షికన వెలువడిన జనవిజయం దినపత్రిక ఖమ్మంజిల్లా వేంసూరు మండల పరిధిలోని మర్లపాడు గ్రామానికి చెందిన ప్రజాసమస్య కథనానికి 24 గంటలు గడవకముందే మండల, గ్రామ పంచాయతీ అధికారులు స్పందించి ఈ నెల 8 న అనగా మంగళవారం వీధి దీపాన్ని వెలిగించారు.ప్రజా సమస్యలపై అధికారులను కదిలిస్తూ ముందుకు సాగుతున్న జనవిజయం పత్రికకు గ్రామ బీసీ కాలని వాసులు,సిఐటియు నేతలు పర్స అప్పారావు,మల్లూరు చంద్రశేఖర్ లు కృతజ్ఞతలు తెలిపారు.