పెనుబల్లి,ఏప్రియల్ 17(జనవిజయం): గురువారం పెనుబల్లి మండల పరిధిలోని వి.యం బంజరు గ్రామంలో వరి కొనుగోలు కేంద్రంను తహసిల్దార్ గంటా ప్రతాప్ ప్రారంభించారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే రైతులు పండించిన వరి పంటకు బోనస్ ఇస్తుందన్నారు.రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమం లో నీలాద్రిశ్వర దేవస్థానం చైర్మన్ చీకటి చిన్న నరసింహారావు,వి యం బంజరు గ్రామ ఇందిరమ్మ కమిటీ సభ్యులు మిట్టపల్లి కిరణ్ కుమార్,మేకతోటి కాంతయ్య పాల్గొన్నారు.