సత్తుపల్లి,ఆర్ సి,ఏప్రియల్17(జనవిజయం):ఖమ్మంజిల్లా సత్తుపల్లి డిపోకు చెందిన నాన్ ఎసి లహరి బస్సులో ప్రయాణించిన ప్రయాణికుడు చరణ్ 22 వేల రూపాయల విలువ చేసే తన ఇయర్ బడ్స్ ను పోగొట్టుకున్నాడు.అట్టి బడ్స్ ను డ్రైవర్ గమనించి భద్ర పరిచారు.గురువారం సత్తుపల్లి డిపో వద్ద చరణ్ కు పెనుబల్లి మండల పరిధిలోని బయన్నగూడెం గ్రామానికి చెందిన అట్టి బస్సు డ్రైవర్ వి.వి.కె. చారి (ఈ 827167)నిజాయితీగా స్టేషన్ మేనేజర్ ఆనందం సమక్షంలో ఇయర్ బర్డ్స్ అందించారు.చారి ను డిపో మేనేజర్ యు.రాజ్యలక్ష్మి,మాజీ ఎంపీటీసీ వంగా నిరంజన్ గౌడ్,పలువురు ఉద్యోగులు అభినందించారు.