- దాతృత్వం ఉన్న దాతలు ముందుకు రావాలి
- డి ఏం.రాజ్యలక్ష్మి పిలుపు
సత్తుపల్లి,ఆర్ సి,ఏప్రియల్ 17(జనవిజయం): ప్రయాణికులకు,ఆర్టీసీ సిబ్బందికి వేసవి కాలంలో స్వాంతన కల్పించాలనే సంకల్పంతో వడదెబ్బకు గురికాకుండా ఉండేందుకు దాతల సహకారంతో కల్లూరు పట్టణ ఆర్టీసీ బస్టాండ్ లో చేస్తున్న ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం గురువారంతో 30 వ రోజుకు చేరింది.గురువారం కల్లూరు పట్టణంలో గల శాంతినగర్ కు చెందిన మల్లాది చిన్న ప్రసాద్ – రాశి దంపతులు తమ కుమారుడు మల్లాది తేజేంద్ర జన్మదినాన్ని పురస్కరించుకొని మజ్జిగ తో పాటు ప్రయాణికులకు స్వీట్లు పంపిణీ చేశారు. తేజేంద్ర కు ప్రయాణికులు,డి ఏం.రాజ్యలక్ష్మి,ఆనంద్ లు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.సేవే చేసే దాతృత్వం మంచిదన్నారు.ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం మొత్తంగా 90 రోజుల పాటు జరుగుతుందని దాతలు ముందుకు రావాలని సత్తుపల్లి ఆర్టీసీ డిపో మేనేజర్ యు.రాజ్యలక్ష్మి,గ్రామీణ బస్సు అధికారి(వి.పి.ఓ.) కిన్నెర ఆనంద్ లు కోరారు.