- కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన రాగమయి
సత్తుపల్లి,ఆర్ సి,ఏప్రియల్17(జనవిజయం): రైతులు పండించిన రెండు పంటలైన రబీ,ఖరీఫ్ వరి పంటలకు బోనస్ అందించే సర్కారు దేశంలో కేవలం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వమేనని మేమేనని సగర్వంగా చెబుతామని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ గురువారం ఖమ్మంజిల్లా పెనుబల్లి మండల పరిధిలోని బ్రహ్మాలకుంట గ్రామంలో అన్నారు. ముందుగా దొడ్డు రకం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మొదటి బస్తా కాంటా వేసి రాగమయి ప్రారంభించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కు జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ముగ్గురు మంత్రులకు మట్టా రాగమయిదయానంద్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో:- కల్లూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భాగం నీరజాప్రభాకర్, వైస్ చైర్మన్ రాజబోయిన కోటేశ్వరరావు,పెనుబల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు పంది వెంకటేశ్వరరావు లతో పాటు కాంగ్రెస్ అనుబంధ సంఘాల కార్యకర్తలు,రైతులు అభిమానులు పాల్గొన్నారు.