- భారీగా నిలిచిన వాహనాలు
- విద్యార్థుల,రోగుల ఇక్కట్లు వర్ణనాతీతం:చలామాల విఠల్ రావు(సీపీఎం జిల్లా కమిటి సభ్యులు)
పెనుబల్లి,ఏప్రిల్17(జనవిజయం): ఖమ్మంజిల్లా పెనుబల్లి మండల పరిధిలోని లంకాసాగర్ క్రాస్ రోడ్డు నుండి అడవిమల్లెల మీదుగా పది గ్రామాలకు వెళ్లే రహదారి చిద్రమయి మూడు సంవత్సరాలు గడుస్తున్న మరామత్తులు చేయడంలేదని చేయాలని కోరుతూ ప్రజలు గురువారం రాస్తారోకో చేశారు.దీంతో అటువైపుగా ప్రయాణం చేసే ధాన్యం మిల్లులకు,మొక్కజొన్న ఫ్యాక్టరీకు చెందిన లారీలు,పలు గ్రామాల నుండి వస్తున్న ఆటోలు భారీగా నిలిచాయి.ప్రభుత్వ ఆసుపత్రికి,గురుకుల పాఠశాల కు వెళ్లే ప్రయాణికులు పలు ఇబ్బందులు పడుతున్నారని వారి బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయని సీపీఎం జిల్లా కమిటి సభ్యులు చలమాల విఠల్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే మరామత్తులు చేయకుంటే పోరాటాన్ని ఉదృతం చేస్తామని పాలకులను హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో: లంకాసాగర్,అడవిమల్లెల గ్రామాల ప్రజలు, ప్రయాణికులు, సీపీఎం,పౌరహక్కుల సంఘం,బీజేపీ నేతలు,మాజీ సర్పంచ్ అశోక్, కాటిన్ని శ్రీను,కండె సత్యం,మిట్టపల్లి నాగమణి తదితరులు పాల్గొన్నారు.