- పేద విద్యార్థి చదువుకు స్ఫూర్తి ఫౌండేషన్ ఆర్థిక సహాయం
పెనుబల్లి ఏప్రిల్ 11(జనవిజయం):ఖమ్మంజిల్లా పెనుబల్లి మండల పరిధిలోని కరాలపాడు గ్రామానికి చెందిన సాతునూరి ప్రణీత్. తండ్రి శ్రీనివాసరావు. తల్లి కమలా కుమారి వ్యవసాయ కూలీలు కావడం వల్ల ప్రణీత్ వెటర్నరీ సైన్స్ ఫస్ట్ ఇయర్ మామునూరు వరంగల్ జిల్లా నందు చదువుతున్నాడు. తల్లిదండ్రులు ఇద్దరు వ్యవసాయ కూలీలు కావడం వల్ల ఆర్థికంగా కుమారుడికి పెట్టలేక ఇబ్బంది పడుతున్న సమయంలో స్ఫూర్తి ఫౌండేషన్ సహాయ కార్యక్రమాలను చూసి స్ఫూర్తి ఫౌండేషన్ ప్రతినిధి వరక రామారావుని సంప్రదించి వారి ఆర్థిక పరిస్థితులు తెలియజేశారు. అనంతరం వరక రామారావు ఆయన బృందంతో విద్యార్థి ఇంటిని ఆర్థిక పరిస్థితులు స్వయంగా సందర్శించి పరిశీలించారు.ఇదే విషయాన్ని స్ఫూర్తి ఫౌండేషన్ దాతల దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే వారు స్పందించి విద్యార్థికి ఒక సంవత్సరానికి అయ్యే ఫీజు 1,00,000/- (లక్ష రూపాయలు) చెక్ ను విద్యార్థి కి అందించారు. ఇంతటి గొప్ప సహాయాన్ని అందించిన స్ఫూర్తి ఫౌండేషన్ దాతలకు విద్యార్థి కుటుంబం, బంధువులు, గ్రామస్తులు, కృతజ్ఞతలు తెలిపారు.