Friday, June 27, 2025
Homeవార్తలుమహిళా విద్యా వ్యాప్తికి పాటుపడిన యోధుడు పూలే

మహిళా విద్యా వ్యాప్తికి పాటుపడిన యోధుడు పూలే

  • వి.ఎం. బంజర్ రింగ్ సెంటర్ నందు జ్యోతిరావు పూలే 198వ జయంతి

సత్తుపల్లి,ఆర్ సి,ఏప్రియల్11(జనవిజయం): ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల రింగ్ సెంటర్ నందు జ్యోతిరావు పూలే 198వ జయంతి ఉత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు, ముందుగా జ్యోతిరావు పూలే చిత్రపటం నాకు రిటైర్డ్ టీచర్ శెట్టి వెంకటేశ్వరావు పూలమాల వేసారు. సభా కార్యక్రమానికి తాండరాజేశ్వరావు అధ్యక్షత వహించారు. పాల్గొన్న సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చలమాల విఠల్ రావు మాట్లాడుతూ జ్యోతిరావు పూలే 198వ జయంతి, ఆయన చేసిన సంఘ సేవ కార్యక్రమాలను కొనియాడుతూ, మహిళా విద్యా వ్యాప్తి కోసం ఆయన చేసిన కృషిని కొనియాడారు, ఈ కార్యక్రమంలో మానవ హక్కుల సంఘం జిల్లా నాయకులు కాటినేని శ్రీనివాసరావు, సిపిఎం మండల కార్యదర్శి గాయం తిరుపతి రావు, సిపిఎం మండల నాయకులు తడికమళ్ళ చిరంజీవి, నల్లమల్ల అరుణ ప్రతాప్, సీ.ఐ.టీ.యూ. నాయకులు చీప్. వెంకటేశ్వరరావు , అమాలి యూనియన్ నాయకులు మిద్దె స్వామి, రిక్షా కార్మిక సంఘం సడిం రాజు బుర్రి సీతారాములు, మరియు మల్లెల శ్రీనివాసరావు, ఆటో యూనియన్ నాయకులు మరీదు చంద్రశేఖర్,వాసు రమణ,టైలర్స్ యూనియన్ సీనియర్ నాయకులు ఎస్.కె అబ్దుల్, తదితరులు పాల్గొని పూలు జల్లి నివాళులు అర్పించడం జరిగింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments