Friday, June 27, 2025
Homeవార్తలుకార్మిక ప్రదర్శనను జయప్రదం చేయండి

కార్మిక ప్రదర్శనను జయప్రదం చేయండి

  • వైరాలో జరిగే టీయుసిఐ జిల్లా ప్రధమ మహాసభను జయప్రదం చేయండి
  • టీయుసిఐ ఏరియా కార్యదర్శి అమర్లపూడి శరత్

సత్తుపల్లి,ఆర్సి,ఏప్రియల్12(జనవిజయo: నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడులను రద్దు చేయాలని ,ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనం 25 వేల రూపాయలు ఇవ్వాలని,నరేంద్రమోడీ ప్రభుత్వం తీసుకొస్తున్న వ్యవసాయ మార్కెట్ చట్టాలను వెనక్కి తీసుకోవాలని,ప్రభుత్వ రంగ పరిశ్రమల ప్రైవేటీకరణ ఆపాలని,కాంట్రాక్క్ కార్మికులను పర్మినెంట్ చేయాలని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టి యు సీ ఐ) ఖమ్మం జిల్లా ప్రధమ మహాసభ రేపు అనగా ఆదివారం వైరా పట్టణంలో జరుగుతుందని సత్తుపల్లి ఏరియా కార్యదర్శి ఆమర్లపూడి శరత్ తెలిపారు.స్థానిక నీలం రామచంద్రపురం లో జరిగిన సమావేశంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ మహాసభ జిల్లాలో ఎన్నుకోబడ్డ 350 మంది ప్రతినిధులతో జరుగుతుందన్నారు.ఈ మహాసభలను ప్రారంభ ఉపన్యాసకులుగా టియుసిఐ రాష్ట్ర ప్రధానకార్యదర్శి సూర్య ప్రారంభించనున్నారని,ముఖ్య వక్తగా టియుసిఐ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎస్ఎల్ పద్మ,సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి గోకేనపల్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొని ప్రసంగించనున్నారని ప్రతినిధులు సకాలంలో హాజరు కావాలని వైరా పట్టణంలో జరుగు కార్మిక ప్రదర్శనను,మహాసభను జయప్రదం చేయాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు.హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని , మున్సిపాలిటీ కార్మికుల నెలసరి వేతనాలు ప్రతి నెల మొదటి వారంలో జమ చేయాలని, రోజురోజుకు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వేతనాలు కూడా పెంచాలని ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరారు.వైరా పట్టణంలో ఆదివారం జరుగు టియుసిఐ ప్రథమ మహాసభకు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు కార్మికులను కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments