- జర్నలిస్టుల సమస్యలపై పోరాడే యూనియన్ టి డబ్ల్యూ జేఎఫ్
- సంఘ రాష్ట్ర జిల్లా నాయకులు రాజశేఖర్, శ్రీనివాసరెడ్డి, ఖదీర్
- జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాం
- చరవాణి ద్వారా మాట్లాడిన ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్
- సత్తుపల్లి లో టి డబ్ల్యూ జేఎఫ్ సభ్యత్వ నమోదుకు భారీ స్పందన
సత్తుపల్లి,ఏప్రియల్10(జనవిజయం):జర్నలిస్టుల సమస్యలపై నిఖార్సైన పోరాటం చేసుకుంటూ ముందుకు పోతుందని ఆ సంఘ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ బట్టిపాటి రాజశేఖర్, జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి, నాయకులు సయ్యద్ ఖాదీర్ స్పష్టం చేశారు. సత్తుపల్లి లోని స్థానిక లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్ లో గురువారం టి డబ్ల్యూ జేఎఫ్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ సిహెచ్ బాలకృష్ణ అధ్యక్షతన సత్తుపల్లి నియోజకవర్గస్థాయి జర్నలిస్టుల సభ్యత్వ నమోదు కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడుతూ, జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం టిడబ్ల్యూజేఎఫ్ పనిచేస్తుందనటానికి ఇటీవల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలే నిదర్శనం అన్నారు. జర్నలిస్టులకు రేషన్ కార్డులు ఇప్పించడం రాజీవ యువ వికాస్ పథకంలో జర్నలిస్టు కు ప్రాధాన్యత కల్పించే లా కృషి చేయటం. ఆరోగ్యశ్రీ కార్డులు అన్ని ఆసుపత్రిలో చెల్లుబాటు అయ్యేలా కృషి చేయడం జిల్లా మండల జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల సాధన కోసం మంత్రులు అధికారులు కలవడం లాంటి కార్యక్రమాలు ఇటీవల కాలంలో టిడబ్ల్యూజేఎఫ్ విజయవంతంగా నిర్వహిస్తూకుంటూ వస్తుందన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం కష్టపడే మనస్తత్వం ఉన్న సభ్యులను సంఘం గుర్తించి పదవుల కట్టబెడుతుందని తేల్చి చెప్పారు. సంఘం జిల్లా నాయకులు బాలకృష్ణ ,రవికిరణ్ ,మాధవరావు, సంజీవరావు, అయ్యప్ప, జర్నలిస్టుల సమస్యలపై ప్రసంగించారు.
సత్తుపల్లి లో టి డబ్ల్యూ జేఎఫ్ సభ్యత్వ నమోదుకు భారీ స్పందన
టి డబ్ల్యూ జేఎఫ్ నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో సత్తుపల్లి నియోజకవర్గంలో సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ ,మండలాల జర్నలిస్టులు మంచి భారీ స్పందన వచ్చింది. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం సాధన కోసం టి డబ్ల్యూ జేఎఫ్ జిల్లా నాయకత్వం ఇటీవల కాలంలో నిర్వహించిన కార్యక్రమాలే ఈ భారీ స్పందన రావడానికి కారణమైందని ఆ రెండు యూనియన్ల కు చెందిన పలువురు జర్నలిస్టులు ఆయా సంఘాలకు రాజీనామా చేసి టిడబ్ల్యూజేఎఫ్ లో గురువారం 50 మందికి పైగా చేరారు.
జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాం ఎమ్మెల్యే డాక్టర్ రాగమయి దయానంద్
జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ఎప్పుడూ టిడబ్ల్యూజేఎఫ్ కి తమ మద్దతు తోడు ఉంటుందని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగ మయి దయానంద్ చరవాణి ద్వారా తెలిపారు.సమావేశంలో పాల్గొన్న జర్నలిస్టులకు అభినందనలు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశం లో జిల్లా నాయకులు జానీ, మూర్తి, సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ, మండలాల రిపోర్టర్లు, కొత్తపల్లి సుధాకర్, ఏ.అనిల్, కరుణాకర్, జి.వెంకటేశ్వరరావు, రాఘవ, వేలాద్రి, ముస్తఫా, మీరా, మోహన్ రాజ్, బాజీ ,మోహన్, సూర్య ,జగన్, అశోక్, రోషిని, సునీత, పలువురు జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.