ఓటర్ల జాబితా సవరణ తేదీలు ప్రకటన
ఖమ్మం, జులై 20 (జనవిజయం):
ఓటర్ల జాబితా సవరణ తేదీలను ఎన్నికల సంఘం ప్రకటించింది.
ఆగస్టు 1న ముసాయిదా జాబితాను ప్రకటించనున్నట్లు తెలిపింది.
ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 19 వరకు ఓటర్ లిస్టులో పేర్లు చేర్చుకోవడానికి, మార్పులు చేసుకోవడానికి అవకాశం కల్పించనున్నట్లు పేర్కొంది.
సెప్టెంబర్ 28 నుంచి అభ్యంతరాలు, దరఖాస్తులను పరిశీలించి అక్టోబర్ 4న తుది ఓటరు జాబితాను ప్రకటించనున్నట్లు తెలిపింది.