RK రామకృష్ణ డైరీ ఆధారంగానే శిరీష ఆలియాస్ పద్మక్క అరెస్ట్?
హైదరాబాద్,22 జూలై(జనవిజయం) :
మావోయిస్ట్ అగ్రనేత ఆర్కే భార్య శిరీషను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ ఐఏ శుక్రవారం అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. కాగా, శనివారం శిరీష అరెస్ట్ పై ఎన్ఐఏ కీలక ప్రకటన చేసింది. మావోయిస్టు ఆర్కే డైరీ ఆధారంగా అతడి భార్య శిరీషను అరెస్ట్ చేసినట్లు ఎన్ఐఏ ప్రకటించింది. ఆర్కే భార్య శిరీషతో పాటు దుడ్డు ప్రభాకర్ను కూడా అరెస్ట్ చేసినట్లు తెలిపింది. దుడ్డు ప్రభాకర్, శిరీష మావోయిస్టుల కోసం పని చేస్తున్నారని ఎన్ఐఏ పేర్కొంది. వీరిద్దరూ 2019లో జరిగిన తిరియా ఎన్ కౌంటర్లో పాల్గొన్నారని.. శిరీష, దుడ్డు ప్రభాకర్ మావోయిస్టుల రిక్రూట్ మెంట్ కోసం కూడా పని చేస్తున్నారని ఎన్ఐఏ ఆరోపించింది. మావోయిస్టుల నుండి వీరికి భారీగా నిధులు అందుతున్నాయని తెలిపింది. మావోయిస్ట్ వారోత్సవాల సందర్భంగా వీరు భారీ కుట్రకు ప్లాన్ చేశారని వీరి అరెస్ట్ సందర్భంగా ఎన్ఐఏ వెల్లడించింది..