సాగునీరు విడుదల చేసిన ఎమ్మెల్యే పోదెం వీరయ్య
భద్రాచలం, జూలై 24 (జనవిజయం):
చర్ల మండలంలోని పెద్దమిడిసీలేరు మధ్య తరహా ఇరిగేషన్ ప్రాజెక్ట్ నుండి సాగు నీటిని సోమవారం ఎమ్మెల్యే పోదేం వీరయ్య విడుదల చేశారు. కుడి, ఎడమ కాలువలు ద్వారా వ్యవసాయ అవసరాల నిమిత్తం ఈ నీటిని ఎమ్మెల్యే విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమములో ఇరిగేషన్ డి.ఈ తిరుపతయ్య, స్థానిక కాంగ్రెస్ నాయకులు నల్లపు దుర్గా ప్రసాద్, విజయ్ భాస్కర్ రెడ్డి, బండారు రామకృష్ణ ఎంపీపీ గీదా కోదండరామయ్య, ఎంపీటీసీ పద్మజ, సర్పంచ్ రాధా బాలకృష్ణ, ఇందల బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు.