- ఐ.ఎన్.టి.యు.సి కమిటీ నూతన సభ్యులను పరిచయం చేసిన క్రాంతి కుమార్
సత్తుపల్లి, ఆర్ సి,ఏప్రియల్16(జనవిజయం): సత్తుపల్లి లో కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ రజాక్ ఆదేశాల మేరకు జె.వి.ఆర్ ఓసి ప్రాజెక్ట్ మేనేజర్ బెజ్జంకి రాజేశ్వరరావును కలిసిన బ్రాంచ్ సెక్రటరీ తీగల క్రాంతికుమార్ మరియు ఐఎన్టీయూసీ బృందం. జే.వి.ఆర్ ఓసి ఐఎన్టీయూసీ ఫిట్ సెక్రటరీ రామారావు ఆధ్వర్యంలో వివిధ కమిటీలో నూతనంగా ఎన్నుకోబడిన నాయకులు కాజా మొయినుద్దీన్ ( మైనింగ్ స్టాఫ్ ఇంచార్జ్ ) , చంద్రమౌళి ( ఓల్డ్ సిహెచ్పి ఇంచార్జ్ ) , ఆర్గనైజింగ్ సెక్రటరీలు నాగేందర్రావు , జనగాం శ్రీనివాస్ , దావూద్ ( మైన్స్ కమిటీ ) సభ్యులను మేనేజర్ రాజేశ్వరరావు కు పరిచయం చేసిన బ్రాంచ్ సెక్రటరీ క్రాంతి కుమార్. క్రాంతి కుమార్ మాట్లాడుతూ ఉద్యోగుల పలు సమస్యలు పరిష్కరించాలని కోరారు. ముఖ్యంగా సింగరేణిలో అత్యధికంగా ఉత్పత్తి సాధిస్తున్నటువంటి జె.వి.ఆర్ ఓసి ఉద్యోగులకు ఇన్సెంటివ్ వచ్చే విధంగా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. జే.వి.ఆర్ ఓసిలో ఐ.ఈ.డి నామ్స్ ప్రకారం వివిధ డిపార్ట్మెంట్లలో మ్యాన్ పవర్ సర్దుబాటు చేయాలని కోరారు. ఉద్యోగులకు యాక్టింగ్ ఆధారంగా ప్రమోషన్స్ ఇవ్వాలని కోరారు.జే.వి.ఆర్ ఓసి అత్యధికంగా సుమారు 16 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం నిర్దేశించిన క్రమంలో జే.వి.ఆర్ ఓసి లో నూతనంగా హెచ్.ఇ.ఎం.ఎం మిషనరీ శవల్స్ , డోజర్స్ , డంపర్లు , మోటార్ గ్రేడర్లు మరియు అత్యధిక కెపాసిటీ వాటర్ స్ప్రింక్లర్స్ తెప్పించాలని కోరారు. గత ఆర్థిక సంవత్సరం సింగరేణిలో ఎక్కడ లేని విధంగా జె.వి.ఆర్ ఓసి కి నిర్దేశించిన సుమారు 112 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించిన ఉద్యోగులకు ప్రత్యేక బహుమతులు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ జాయింట్ సెక్రటరీ నాగ ప్రకాష్ , బాలాజీ ( ఫిట్ సెక్రటరీ , కిష్టారం ఓసి ) , నాగేశ్వరరావు ( ఫిట్ సెక్రటరీ , జె.వి.ఆర్ సి.హెచ్.పి ) , జే.వి.ఆర్ ఓసి చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సుదర్శన్ , అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీలు కోటి , సురేష్ నాయకులు రఫీ , రషీద్ , బాలకృష్ణ , మురళి , కిషన్ రావు , పొట్టి కిరణ్ , మున్వర్ ఖాన్ , శ్రీధర్ , అప్సర్ , శేషపు శీను , రమేష్ , చెరుకు రాజు , నరేందర్ , మోసిన్ సదానందం , హరికుమార్ , తిరుపతి ఇతర ముఖ్య నాయకులు , ఉద్యోగస్తులు పాల్గొన్నారు.