ప్రియతమ ప్రధాని మన్ కి బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన ఖమ్మం జిల్లా భా.జ.ప శ్రేణులు
ఖమ్మం, ఫిబ్రవరి, 26 (జనవిజయం): భారత ప్రధాని నరేంద్ర మోడీ 98వ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా ఆఫీసు నందు మాజీ ఎంపీ, మాజీ మంత్రివర్యులు రవీంద్ర నాయక్, బిజెపి జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ వీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాని ఈ కార్యక్రమంలో తెలిపిన విషయాలను వెల్లడించారు.మన్కీ బాత్ కార్యక్రమంలో ఏపీకి చెందిన స్వాతంత్ర సమరయోధుడు నరసింహారెడ్డిపై టి.విజయ దుర్గ అనే మహిళ పాడిన పాటను ప్రధాని వినిపించారు. ప్రధాని మోదీ ప్రసంగిస్తూ ప్రజల భాగస్వామ్య వ్యక్తీకరణకు మీరందరూ ‘మన్ కీ బాత్’ను అద్భుతమైన వేదికగా మార్చుకున్నారని అన్నారు. అలాగే, సాంప్రదాయ క్రీడలను ప్రోత్సహించడం గురించి, భారతీయ బొమ్మల గురించి, హోలీ పండుగ గురించి మాట్లాడుతూ వోకల్ ఫర్ లోకల్ అనే సంకల్పంతో పండుగలను జరుపుకోవాలి అని సూచించారు.
ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షురాలు మంద సరస్వతి జిల్లా ప్రధాన కార్యదర్శులు రుద్ర ప్రదీప్, శ్యామ్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.