Tuesday, October 3, 2023
Homeవార్తలుమణిపూర్ దోషులను కఠినంగా శిక్షించాలి

మణిపూర్ దోషులను కఠినంగా శిక్షించాలి

మణిపూర్ దోషులను కఠినంగా శిక్షించాలి

  • ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ

భద్రాచలం, జూలై 21 (జనవిజయం):

మణిపూర్ లో మహిళలను నగ్నంగా ఊరేగించి,అతి కిరాతకంగా అత్యాచారం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని స్థానిక ఆదివాసీ సంఘాల నేతలు డిమాండ్ చేసారు. శుక్రవారం ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో భద్రాచలం లో నిరశన ప్రదర్శన జరిపారు. ఈ సందర్భంగా పలువురు ఆదివాసీ నాయకులు మాట్లాడుతూ తక్షణమే కేంద్ర ప్రభుత్వం స్పందించి జరిగిన ఘటన పై సమగ్ర విచారణ జరిపించాలని, దోషులను కఠినం గా శిక్షించాలని డిమాండ్ చేసేరు. ఈ కార్యక్రమం లో నాయకులు గుండు శరత్, పూనెం వీరభద్రమ్, పూనెం నాగేశ్వరరావు, గొంది బాలయ్య, పాయం రవివర్మ, జోగారావు, సున్నం గంగ తదితరులు పాల్గొన్నారు. మాలమహానాడు నాయకుడు దాసరి శేఖర్, అలవాల రాజు, చలగుల్ల నాగేశ్వరరావు తదితరులు సంఘీభావం తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments