లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తం గా ఉండాలి
- ఏఎస్పీ సంతోష్ పంకజ్
భద్రాచలం, జూలై 23 (జనవిజయం):
గోదావరి బేసిన్ ఎగువ పరీవాహక ప్రాంతాలలో వర్షాల కారణంగా,గోదావరి నదికి వరద వచ్చే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏఎస్పీ పరితోష్ పంకజ్ ఆదివారం ఒక ప్రకటన లో విజ్ఞప్తి చేశారు. ఒకవేళ గోదావరి వరద పెరిగితే లోతట్టు ప్రాంతాల ప్రజలు పోలీసులకు సహకరించి దగ్గరలోని పునరావాస కేంద్రాలకు వెళ్లవలసిందిగా కోరుచున్నాము. భద్రాచలంలో కరకట్ట, రెడ్డి సత్రం వైపు ప్రజలు వెళ్లవద్దని కోరుచున్నాము. జాలరులు, చేపల వేటకు వెళ్లేవారు గోదావరిలో, నిండుగా ప్రవహిస్తున్న వాగులలో, కుంటలు, చెరువులలోకి వెళ్లవద్దని కోరుచున్నాము. ఆపదలో ఉన్నవారు పోలీసుల సహాయం కొరకు డయల్ 100 కు ఫోన్ చేయగలరని తెలియజేస్తున్నాము. పోలీసుశాఖ ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలుపుతున్నామని ఆ ప్రకటనలో తెలిపారు.