జిల్లా పోలీస్ యూనిట్ వెల్ఫేర్ హాస్పిటల్ ను ప్రారంభించిన
..ఎస్పీ డా.వినీత్.జి…
జనవిజయం, 06 మే ( భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ) : జిల్లా పోలీస్ హెడ్క్వార్టర్స్ హేమచంద్రపురం నందు పోలీస్ యూనిట్ వెల్ఫేర్ ఆసుపత్రిని ఎస్పీ డా.వినీత్.జి ప్రారంభించారు.జిల్లా పోలీసు అధికారులు,సిబ్బంది వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకొని యూనిట్ హాస్పిటల్ ను ప్రారంభించినట్లు ఎస్పీ ఈ సందర్భంగా తెలియజేసారు. నిరంతరం విధులు నిర్వర్తిస్తూ ప్రజలకు సేవలు అందిస్తున్న అధికారులు సిబ్బంది సంక్షేమం కొరకు ఎల్లప్పుడూ ముందుంటామని అన్నారు. ప్రస్తుతం తాత్కాలికంగా ఈ ఆసుపత్రిని ప్రారంభించినట్లు తెలియజేశారు.పూర్తిస్థాయి సౌకర్యాలతో అతి త్వరలోనే మంచి ఆసుపత్రిని అందిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ టి.సాయి మనోహర్,ఏఆర్ అడిషనల్ ఎస్పీ విజయ్ బాబు,మెడికల్ కాలేజ్ సూపరింటెండెంట్ కుమార డి సి హెచ్ ఎస్ రవి బాబు, జిల్లా వైద్యాధికారి శిరీష,కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్,యూనిట్ హాస్పిటల్ వైద్యులు హరీష్ మరియు అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.