జిల్లా జడ్జీకి ఘనంగా వీడ్కోలు సన్మానం
భద్రాచలం, ఏప్రిల్ 24(జనవిజయం) :కొత్తగూడెం జిల్లా ప్రధాన న్యాయ మూర్తి ,లీగల్ సర్వీస్ అథార్టీ చైర్మన్ పసుపులేటి చంద్రశేఖర్ ప్రసాద్ బదిలీ అయి మహబూబాబాద్ జిల్లా ప్రధాన న్యాయ మూర్తిగా నియమిస్తూ ఇటీవలే హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. ఆయన్ని భద్రాచలం న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కోట దేవదానం కార్యవర్గ సభ్యులు పుష్ప గుచ్ఛం ఇచ్చి సాలువాతో సత్కరించి ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు.
ఈ సందర్భంగా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కోట దేవదనం మాట్లాడుతూ., జిల్లా న్యాయమూర్తిగా బాధ్యత చేపట్టిన అతి తక్కువ కాలంలోనే జిల్లా కోర్టు ప్రాంగణాన్ని సర్వ సుందరంగా తీర్చిదిద్దారని, లీగల్ సెల్ సర్వీస్ అథారిటీ ఛైర్మన్ గా లోక్ అదాలత్ లు నిర్వహించి వేల సంఖ్యలో కేసులు పరిష్కరించారని అన్నారు. న్యాయ వాదులు శ్రీనివాస చారి, సున్నం రమేష్, సాధనపల్లి సతీష్ ,రామకృష్ణ పాల్గొన్నారు.