Tuesday, October 3, 2023
Homeవార్తలువరద నష్టంపై కేంద్రానికి సమగ్ర నివేదిక అందజేస్తాం : కేంద్ర బృందం

వరద నష్టంపై కేంద్రానికి సమగ్ర నివేదిక అందజేస్తాం : కేంద్ర బృందం

భద్రాద్రి కొత్తగూడెం, ఆగష్టు 03 (జనవిజయం): ఎడతెరిపి లేని భారీ వర్షాలు, గోదావరి వరదలతో జిల్లాలో తీవ్ర నష్టం వాటిల్లిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక తెలిపారు. వర్షాలు, వరదల వల్ల దెబ్బతిన్న నష్టాలను క్షేత్రస్థాయిలో అంచనా వేసేందుకు గురువారం కేంద్ర బృందం అస్వాపురం, బూర్గంపాడు మండలాల్లో పర్యటించింది. జాతీయ విపత్తులు, హెూం మంత్రిత్వ శాఖ సలహాదారు కునాల్ సత్యార్థి, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్ పెండిచర్ డిప్యూటీ సెక్రటరీ అనిల్ గైరోల, సెంట్రల్ వాటర్ కమిషన్ డైరెక్టర్ రమేష్ కుమార్, మినిస్ట్రీ ఆఫ్ పవర్ డిప్యూటీ డైరెక్టర్ భయా పాండే, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ సీనియర్ సైంటిస్ట్ శ్రీనివాసులు, ఆయిల్ సీడ్స్ డైరెక్టర్ డా పొన్నుస్వామి, ఐఈఎస్ రీజినల్ అధికారి ఎస్కే కుష్వా అధికారుల బృందం లో ఉన్నారు. వర్షాలు, వరదలు జరిగిన నష్టాలపై ఐటిడిఏ సమావేశపు హాలులో ఏర్పాటు చేసిన ఛాయా చిత్ర ప్రదర్శనను వీరు పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక వర్షాలకు దెబ్బతిన్న ఇళ్లు, రహదారులు, పంటలు, లింకు రోడ్లు, పశుసంపద, మిషన్ భగీరథ పథకాలు, ఇరిగేషన్ చెక్ డ్యాంల వివరాలను బృందం కు వివరించారు. అనంతరం బూర్గంపాడు మండలం పుల్తేరువాగు గ్రామం లో కొల్లు చెరువులు, దెబ్బతిన్న పత్తి పంటను పరిశీలించారు. రైతులతో ముఖాముఖి మాట్లాడారు. అశ్వాపురం మండలం ఆనందాపురంలో పర్యటించి దెబ్బతిన్న పత్తి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక గత నెలలో కురిసిన భారీ వర్షాలు వల్ల అధిక వర్షపాతం నమోదైనట్లు వివరించారు. వర్షాలు, గోదావరి వరదల వల్ల జిల్లాలోని 11 మండలాల పరిధిలోని 84 గ్రామాలు ముంపుకు గురైనట్లు తెలిపారు. ముంపుకు గురైన గ్రామాల ప్రజలను 44 పునరావాస కేంద్రాలకు తరలించినట్లు చెప్పారు. ముంపుకు గురైన 4,454 కుటుంబాలకు చెందిన 14,081 మందిని పునరావాస కేంద్రాలకు తరలించినట్లు చెప్పారు. వరదల సహాయక చర్యలకు 23 మంది మండల ప్రత్యేక అధికారులు, 184 మంది గ్రామస్థాయి ప్రత్యేక అధికారులు, 548 మంది గ్రామ పంచాయతీ స్థాయి అధికారులు, 7 మంది సెక్టోరియల్ అధికారులు, 42 మంది జోనల్ అధికారులు, 11 మంది మొబైల్ టీములను నియమించినట్లు కలెక్టర్ స్పష్టం చేశారు. 103 ఆవాసాల్లో 11 చోట్ల మిషన్ బగీరథ ద్వారా మంచినీటి సరఫరాకు మరమ్మత్తులు వాటిల్లినట్లు చెప్పారు. ఆరు మండలాల పరిధిలోని తొమ్మిది గ్రామాల్లో 15 పశువులు, 19 మేకలు, 3030 కోళ్లు చనిపోయినట్లు చెప్పారు. 41 గృహాలు పూర్తిగాను, 162 గృహాలు పాక్షికంగా దెబ్బతిన్నట్లు చెప్పారు. 16 మండలాల పరిధిలోని 44 గ్రామాలకు చెందిన 1402. మంది రైతులకు 3151 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు చెప్పారు. పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని 115 రోడ్లు మరమ్మత్తులకు గురైనట్లు చెప్పారు. ఇరిగేషన్ శాఖకు సంబంధించి 47 చోట్ల మరమ్మత్తులకు గురైనట్లు తెలిపారు. ఆర్ అండ్ శాఖ పరిధిలోని 61 ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నట్లు చెప్పారు. అనంతరం అశ్వాపురం మండల పరిధిలోని ఆనందాపురం గ్రామంలో వరద ముంపు వల్ల దెబ్బతిన్న పత్తి పంటను అదికారుల బృందం పరిశీలించింది. రైతులతో ముఖాముఖి అయిన అధికారుల బృందం వరదలు సంభవించినా మంపు వాటిల్లని పంటలు సాగు చేపట్టే విధంగా రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. వర్షాలు, గోదావరి వరదలు వల్ల దెబ్బతిన్న పంటలు, రహదారులు క్షేత్రస్థాయిలో పరిశీలించామని, జరిగిన నష్టాలపై సమగ్ర నివేదికలు కేంద్ర ప్రభుత్వానికి అందచేయ నున్నట్లు అధికారుల బృందం తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ఎస్పీ డాక్టర్ వినీత్, ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ప్రతీక్ జైన్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్జు, ఇరిగేషన్ ఎస్ఈ వెంకటేశ్వరరెడ్డి, ఆర్ అండ్ బీ ఈఈ భీమ్లా, పంచాయతీరాజ్ ఈఈ మంగ్యా, వ్యవసాయ అధికారి అభిమన్యుడు, ఉద్యాన అధికారి జినుగు మరియన్న, పశుసంవర్థక శాఖ డిడి పురందర్, మిషన్ భగీరథ ఈఈలు తిరుమలేష్, నళిని తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments