ఖమ్మం, ఆగష్టు 18 (జనవిజయం): నూతన కలెక్టరేట్ లో ఏర్పాటుచేసిన శ్రీ శక్తి కమ్యూనికేషన్ జిరాక్స్, ఇంటర్నెట్ సేవల కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్రం నిర్వాహకులు ప్రతాపని అశ్విని, రామ్ కుమార్ లకు కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్, కలెక్టరేట్ ఏవో అరుణ తదితరులు ఉన్నారు.