Thursday, October 5, 2023
Homeవార్తలుహన్మకొండలో 25 నుండి జరిగే డి.వై.యఫ్.ఐ రాష్ట్ర స్థాయి రాజకీయ శిక్షణా తరగతులను జయప్రదం...

హన్మకొండలో 25 నుండి జరిగే డి.వై.యఫ్.ఐ రాష్ట్ర స్థాయి రాజకీయ శిక్షణా తరగతులను జయప్రదం చేయండి

డి.వై.యఫ్.ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు చింతల రమేష్ పిలుపు

-ముఖ్య అతిథిగా హాజరుకానున్న డి.వై.యఫ్. ఐ ఆలిండియా అధ్యక్షుడు యం.పి యమ్.ఎ.రహీమ్

రఘునాదపాలెం, ఆగస్ట్22 (జనవిజయం): హాన్మకొండలో ఆగస్ట్ 25 నుండి 3 రోజుల పాటు జరిగే డి.వై.యఫ్.ఐ రాష్ట్ర స్థాయి రాజకీయ శిక్షణ తరగతులను జరుగుతులన జయప్రదం చేయాలని డి.వై. యఫ్. ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు చింతల. రమేష్ పిలుపునిచ్చారు. ముఖ్య అతిథిగా  డి.వై.యఫ్.ఐ ఆలిండియా అధ్యక్షుడు,యం.పి యమ్.ఎ.రహీమ్ హాజరవుతున్నారని తెలిపారు. స్థానిక చిమ్మపుడి గ్రామంలో డివైఎఫ్ఐ మండల ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చింతల.రమేష్ మాట్లాడుతూ డివైఎఫ్ఐ రాష్ట్ర విద్య వైజ్ఞానిక శిక్షణ తరగతులు ఆగస్టు 24 25 26 తారీకుల్లో హనుమకొండ జిల్లాలో హనుమకొండలో జరగబోతున్నాయని ఈ క్లాసులకు జిల్లా నుంచి 100 మంది హాజరవుతున్నట్లు  తెలియజేశారు.

జిల్లా క్లాసులు సెప్టెంబర్ నెలలో మొదటి వారంలో ఖమ్మంలో జరగబోతున్నాయని ఈ క్లాసులు జయప్రదం చేయాలని ఆయన సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో డివైఎఫ్ఐ నాయకులు జోనెబోయిన. నవీన్, వెంకటేష్, దోంతు.గణేష్,పోతురాజు. వేణు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments