Wednesday, May 14, 2025
Homeవార్తలుడి.జి.ఏం.ను కలిసిన intuc నేతలు

డి.జి.ఏం.ను కలిసిన intuc నేతలు

  • సమంత సి.హెచ్.పి లో డి.ఎఫ్.డి.ఎస్ సిస్టం అమలు చేయాలి
  • ఐ.ఎన్.టి.యు.సి వైస్ ప్రెసిడెంట్ రజాక్

సత్తుపల్లి,ఆర్ సి,ఏప్రియల్19(జనవిజయం):సింగరేణి సత్తుపల్లి జే.వి.ఆర్ సి.హెచ్.పి ఐ.ఎన్.టి.యు.సి ఫిట్ సెక్రటరీ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో డి.జి.ఎం సోమశేఖర్ ను కలిసిన ఏరియా వైస్ ప్రెసిడెంట్ రజాక్. సి.హెచ్.పి ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. జే.వి.ఆర్ సి.హెచ్.పి సింగరేణిలో సమిష్టి కృషితో అత్యధికంగా బొగ్గు రవాణా చేస్తున్న ఉద్యోగులకు , అధికారులకు అభినందనలు తెలియజేశారు. అదేవిధంగా ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేయాలని కోరారు. సింగరేణి సంస్థ దేశంలో బొగ్గు పారిశ్రామిక రంగంలో అధునాతన టెక్నాలజీని ఉపయోగిస్తూ బొగ్గు ఉత్పత్తి మరియు రవాణా చేస్తుంది అని తెలియజేశారు. సింగరేణిలో అదునాతన టెక్నాలజీ డి.ఎఫ్.డి.ఎస్.ఎస్ ( డ్రై ఫాగ్ డస్ట్ సపరేషన్ సిస్టం ) డస్ట్ నియంత్రించుటకు త్వరగా అమలు చేసి కార్మికుల ఆరోగ్యం , సంక్షేమానికి కృషి చేయాలని అధికారులను కోరారు.ఈ కార్యక్రమంలో బ్రాంచ్ సెక్రటరీ తీగల క్రాంతికుమార్ , బ్రాంచ్ జాయింట్ సెక్రెటరీ నాగ ప్రకాష్ , బ్రాంచ్ ఆర్గనైజింగ్ సెక్రెటరీలు రిషీశ్వరరావు , సీతారామరాజు , బాలాజీ ( ఫిట్ సెక్రటరీ , కిష్టారం ఓసి ) , కోటేశ్వరరావు ( ఇంచార్జ్ ఫిట్ సెక్రెటరీ , జే.వి.ఆర్ ఓసి ) , నాయకులు రామకృష్ణ , రమేష్ , వెంకన్న , నాగేందర్ రావు , వెంకటేశ్వర్లు , నవీన్ , రత్నాకర్ , మురళి , రమేష్ , నగేష్ , మోహన్ ఇతర ముఖ్య నాయకులు , ఉద్యోగులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments