ఖమ్మం, ఆగస్టు 18(జనవిజయం): జిల్లాలో జేఎన్టియూ హైదరాబాద్ చే ఏర్పాటుచేయు కళాశాల ప్రతిపాదిత స్థలం ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి లో పరిశీలించిన అనంతరం జేఎన్టీయూ ప్రొఫెసర్ ఎం. మంజూర్ హుస్సేన్, ప్రొఫెసర్ రవీందర్ రెడ్డి లు శుక్రవారం నూతన కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కళాశాల ఏర్పాటుకు ప్రతిపాదిత స్థలం, తాత్కాలికంగా కళాశాల నిర్వహణకు భవన విషయమై కలెక్టర్ తో వారు చర్చించారు.