వేంసూరు,ఏప్రియల్ 19(జనవిజయం):శనివారం ఖమ్మం జిల్లా వేంసూరు మండల పరిధిలోని అడసర్లపాడు గ్రామంలో ఐసీడీఎస్ బీరాపల్లి సెక్టార్ సూపర్వైజర్ భవాని ఆధ్వర్యంలో పోషణ పక్షం కార్యక్రమం నిర్వహించారు. తక్కువ బరువు ఉన్న పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అంగన్వాడీ టీచర్లకు సూచించారు.తక్కువ ఖర్చుతో పోషక విలువలు కలిగినటువంటి ఆహార పదార్థాలను ప్రదర్శన ద్వారా అంగన్వాడీ కేంద్ర లబ్ధిదారులకు చూయించారు. అనంతరం పోషణ పక్వాడ ప్రతిజ్ఞ,ప్రదర్శన చేశారు.ఈ కార్యక్రమంలో:-అంగన్వాడీ టీచర్స్ శాలిని,నిర్మల,విజయ కుమారి, వెంకటమ్మ లు పాల్గొన్నారు.