బిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదు
…భద్రాచలం తెలుగుదేశం పార్టీ …
భద్రాచలం 28 ఆగస్ట్:(జనవిజయం)
తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ మరియు మహబూబాబాద్ పార్లమెంట్ అధ్యక్షులు కొండపల్లి రామచంద్ర రావు ఆదేశాల మేరకు భద్రాచలం తెలుగుదేశం పార్టీ నాయకులు.. బిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదని, ముఖ్యంగా దళితులకు మూడెకరాల భూమి, పేదలకు డబుల్ బెడ్ రూములు, దళిత బంధు, బీసీలకు , మైనార్టీలకు ఆర్థిక సాయం అలాగే భద్రాచలం డివిజన్ ని పూర్తిగా విస్మరించిందని, భద్రాచల రామాలయ అభివృద్ధికి ఇస్తున్న 100 కోట్లు అలాగే భద్రాచలం అభివృద్ధికి ఇస్తానన్న 1000 కోట్లు ఈరోజు వరకు వంద రూపాయలు కూడా ఇవ్వలేదని, తక్షణమే ఇచ్చిన హామీలు నెరవేర్చాలని భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యక్రమంలో వినతి పత్రంలో సమర్పించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది కొడాలి శ్రీనివాస్, కంభంపాటి సురేష్ కుమార్, కుంచాల రాజారాం , అభినేని శ్రీనివాసరావు, కొడాలి చంటి , న్యాయవాదులు రవితేజ , రామకృష్ణ, పసుపులేటి రాంబాబు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.