ఖమ్మం, ఆగష్టు 11 (జనవిజయం) : ఖమ్మం జిల్లా, బోనకల్ మండల కేంద్రంలో గల గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థి అరవింద్, మరో 7 గురు విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయులు పాఠశాల ఆవరణలో ఉన్నటువంటి ఒక పాత ఇంటి లో విరిగి పడివున్న ఇటుకలు తీయించే పని విద్యార్థులచే చేయిస్తున్న క్రమంలో ఒక్క సారిగా గోడ విరిగిపడి అక్కడ పనిచేస్తున్న అరవింద్ పై పడడంతో ముఖం లోపలి ఎముకలు విరగడంతో పాటు, కుడి కాలు కూడా 2 చోట్ల విరిగి తీవ్ర గాయాల పాలయ్యాడు. బాలుడిని స్థానిక కిమ్స్ హాస్పిటల్ నందు అడ్మిట్ చేశారు. విషయం తెలుసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ మధిర అసెంబ్లీ ఇంఛార్జి గంధం.పుల్లయ్య హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న బాలుడిని శుక్రవారం నాడు కలిసి ఆరోగ్య పరిస్థితి ని తెలుసుకోవడం జరిగింది. వారి కుటుంబ సభ్యులకు ఆమ్ ఆద్మీ పార్టీ అండగా ఉంటుందని చెప్పడం జరిగింది. నవోదయ ఘటన మరువక ముందే మరో ఘటన జరిగింది. బంగారు తెలంగాణాలో బడులు నిర్వహణకు, మౌలిక వసతులకు నిధులు కేటాయించని కారణంగా ఉపాధ్యాయులు విద్యార్థులతో ప్రమాదకర పనులు బలవంతంగా చేయించడం వల్లనే ఈ సంఘటనలు జరిగాయి. ముఖ్య మంత్రి కి మద్యం దుకాణాల మీద ఉన్న శ్రద్ద, భూములు అమ్ముకోవడంలో ఉన్న శ్రద్ద, విద్యాలయాల నిర్వహణ మీద, నిధులు కేటాయించడంలో లేదు. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నా చందంగా లక్షల కోట్ల బడ్జెట్ అని ఉదరగొట్టే ముఖ్యమంత్రి కే. సి. ఆర్. విద్యారంగానికి మాత్రం ఎందుకు కేటాయింపులు జరపడంలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం విద్యా వ్యవస్థ మీద దృష్టి పెట్టకపోతే ఆమ్ ఆద్మీ తరపున పోరాటం చేస్తామని తెలియ చేశారు.