Wednesday, May 14, 2025
Homeపరిపాలనసత్తుపల్లిలో అమలు కానీ ట్రాఫిక్ నిబంధనలు

సత్తుపల్లిలో అమలు కానీ ట్రాఫిక్ నిబంధనలు

  • అస్తవ్యస్తంగా వాహనాలు రాకపోకలు
  • సిగ్నల్స్ పట్టని దుస్థితి
  • లలిత కుమారి ఆసుపత్రి రోడ్డు నుండి వెళ్లాలంటే భయం

సత్తుపల్లి,ఆర్ సి,ఏప్రియల్19(జనవిజయం): ఖమ్మంజిల్లా సత్తుపల్లి పట్టణంలో సుభాష్ చంద్రబోస్ రింగ్ సెంటర్ నుండి కూరగాయలు,మాంసo దుకాణాల వద్దకు,ఆర్టీసీ బస్టాండ్ కు లలితకుమారి ఆసుపత్రి రోడ్డు నుండి ప్రజలు,వాహనదారులు,పాదచారులు పోవడానికి,యూ టర్న్ తీసుకొని వెళ్ళే వారికి వేదికగా వుంటుంది.రోజులో నిరంతరం రద్దీగా ఉంటుంది. అట్టి రింగ్ రోడ్డు వద్ద బైక్ లు మొదలు కొని, హెవీ వెహికల్స్, ఆర్టీసీ బస్సుతో సహా ట్రాఫిక్ నిబంధనలను పాటించకుండా అస్తవ్యస్థంగా ప్రయాణం చేయడాన్ని శనివారం నేటి ప్రజావాణి ప్రతినిధి నిఘా నేత్రం బంధించింది. రెడ్ సిగ్నల్ పడినప్పటికీ వాహనాలు ఆగకుండా వెళ్తుంటే లలిత కుమారి ఆసుపత్రి రోడ్డు నుండి వచ్చే వారికి,యూ టర్న్ తీసుకొని వచ్చే వారికి ప్రాణ సంకటంగా మారింది.నిబంధనలు పాటించకుండా వెళ్ళే వాహనాలపై పోలీసులు, అధికారులు చర్యలు తీసుకోకుంటే నిబంధనలు పాటించి వాహనాలను నడిపే వారికి,పాదచారులకు ట్రాపిక్ నిబంధనలపై విశ్వాసం కోల్పోయే ప్రమాదం ఉంది.ప్రాణాలు పోకముందే ట్రాపిక్ పోలీసు అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments