ముదిగొండ, ఫిబ్రవరి 6(జనవిజయం): ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లాపురం గ్రామ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 10 గంటలకు హనుమంతుని దేవాలయం వద్ద జండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. టి పి సి సి చీఫ్ రేవంత్ రెడ్డి తలపెట్టిన హాత్ సే హాత్ జోడో యాత్ర విజయవంతం అవ్వాలని స్థానిక హనుమంతుని దేవాలయం లో పూజలు నిర్వహించి అనంతరం కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు, స్థానిక యమ్ పి టి సి,యస్ సి సెల్ అధ్యక్షులు,బి సి సెల్ అధ్యక్షులు,తాటికొండ రమేష్,నల్లమోతు వెంకటరమణ, తన్నీరు వెంకటేశ్వర్లు,దేశగాని సురేష్ ,అనేక మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
వల్లాపురం గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జండా ఆవిష్కరణ కార్యక్రమం
RELATED ARTICLES