టి యు డబ్ల్యు జె (ఐ జె యు) ఉపాధ్యక్షునిగా యాకూబ్ పాషా ఎన్నిక
-జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తా!
వేంసూరు,ఫిబ్రవరి,27(జన విజయం):- టి.యు.డబ్ల్యు.జె (ఐ.జె.యు) సత్తుపల్లి డివిజన్ ఉపాధ్యక్షునిగా మండలానికి చెందిన ఆంధ్రప్రభ దినపత్రిక రిపోర్టర్ యాకూబ్ పాషా ను సోమవారం సత్తుపల్లి లోని మాధురి పంక్షన్ హాల్ నందు జిల్లా ఉపాధ్యక్షులు ఖాదర్ బాబా అధ్యక్షతన జరిగిన ఆ జర్నలిస్టుల సంఘం డివిజన్ మహాసభలో సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పాషా మాట్లాడుతూ అనునిత్యం జర్నలిస్టుల సమస్యలపై ఐక్య పోరాటాలు నిర్వహిస్తానని సంఘం అప్పగించిన పదవిని బాధ్యతగా భావించి పని చేస్తానని తెలిపారు.అనంతరం మండల ప్రజలు, శ్రేయేభిలాషులు,మీడియా మిత్రులు,ప్రజా సంఘాల నేతలు పాషా కు అభినందనలు తెలపగా పాషా వారికి కృతజ్ఞతలు తెలిపారు.