Tuesday, October 3, 2023
Homeవార్తలుతెల్లబోయిన రాములు జ్ఞాపకార్థం చొప్పకట్లపాలెం బొడ్రాయి సెంటర్ నందు బోరు ఏర్పాటు

తెల్లబోయిన రాములు జ్ఞాపకార్థం చొప్పకట్లపాలెం బొడ్రాయి సెంటర్ నందు బోరు ఏర్పాటు

బోనకల్, ఆగస్టు 26(జనవిజయం): మండల పరిధిలోని చొప్పకట్లపాలెం గ్రామంలో తెల్లబోయిన రాములు జ్ఞాపకార్థం వారి కుమారులు తెల్లబోయిన కృష్ణయ్య, తెల్లబోయిన ముత్తయ్య, కుమార్తెలు కృష్ణకుమారి, ఎలమంచమ్మలు బొడ్రాయి సెంటర్ నందు గ్రామ ప్రజలకు ఉపయోగార్ధము రూ 50000 ఖర్చుతో బోరును ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. మా నాన్న పేరు నిలబడేలా ప్రజలకు ఉపయోగపడేలా తమ వంతు సహాయం చేశామన్నారు.ఈ బోరు ఏర్పాటుతో బొడ్రాయి, పీర్ల సావిడి, పశువుల హాస్పిటల్ కు వచ్చే వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

ఈ కార్యక్రమంలో వారి మనవళ్లు తెల్లబోయిన నాగరాజు, గురవయ్య, సర్పంచ్ సుబ్బారావు, తాళ్లూరి రామారావు, బోగ్గవరపు సోమయ్య, మండెపూడి మోహన్ రావు, మెట్టెల లక్షాద్రి, తెల్లబోయిన నాసరయ్య, తెల్లబోయిన నాగయ్య, మేక వేలాద్రి, షేక్ మస్తాన్, బాలు పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments